పాలు కుడిచి తల్లి చన్ను నరకు చందమున
ప్రకృతిపై మనిషి జరుపుచున్న విధ్వంస కాండకు;
తనకు తాను చేసికొనుచున్న ఘాతుకములకు
మనసు చెదిరి మిక్కిలిగ వేదన నొందు నాకు
ఎవరు తోడు? ఏది ఉపశమనము?
మహాత్ముల ఆలోచనలు, భావములే తోడు
గోవిందుని స్మరించుటయే ఉపశమనము
నంద నందనుని ధ్యానించుటయే మంగళ కరము
No comments:
Post a Comment