"..అరివిరిసిన మందారంలా
ఒక వెలుగు వెలిగిన నేల
ఇప్పుడు చుక్క
నీరు లేక వెలవెలబోతోంది
కోట్లాది జనానికి దాహం తీర్చిన
ఈ అరుదైన పుడమి
ఇప్పుడు వాన చినుకుల కోసం
పరితపిస్తోంది ..
పల్లెలే కాదు ..పట్టణాలు సైతం
జనావాసం లేక స్మశానాలను
తలపింప చేస్తున్నవి ..
వానొస్తే సంబర పడిన పేద జనం
గుక్కెడు నీటి కోసం
పోరాటం చేయాల్సిన దుస్థితి నెలకొంది ..
వందలు కాదు ..వేలాది మంది
నిత్యం వలస బాట పట్టారు
ఇక మిగిలింది చావు ఒక్కటే.."
No comments:
Post a Comment