దివినుండి భువికి దిగివచ్చిన
నయనాందకర నవ పారిజాతం
మేలిమి పసిడి వన్నె ఛాయతో
మిసమిసలు పోతూ చందన పరిమళ
తిలకాల సింగారాలు రంగరించుకొని
అష్టవిధ నాయికల్లో
ఒక్కత్తిగా హోయలొలుకుతున్న
కుందనపు బొమ్మను కన్న
నాగుండెను కోసి గుడిగా మలచి
కొలువు తీర్చేపనిలో నున్నాను
వద్దని వారించే వారిని ఇక
హరించి దివికి సాగనంపుతాను
వలపు తలపులను ఆటంకపరిస్తే
జరగబోయే పరిణామాలకు
ఫలితాలకు వారే భాధ్యులు సుమా
అని ఒక భావకుడిగా నా (ని) వేదన.
No comments:
Post a Comment