Saturday, 21 July 2012

పండు వెన్నెల

పండు వెన్నెల మసక బారింది గుండెలను మేల్కొల్పే ఆ ముగ్ధ మనోహరమైన రూపం చెదిరి పోయింది .. కాలం మిగిల్చిన విషాదమో కన్నీళ్లు మిగిల్చిన జ్ఞాపకమో కానీ ఒక్కొక్కరే ఇక సెలవంటూ ఈ లోకాన్ని వీడి పోతున్నారు కాంతులీనే తెర మీద తమదైన ముద్రను వేసిన ఆ మహానుభావులు సృజియించిన వ్యక్తిత్వపు సంతకం ఇంకా..మదిని దోచేస్తూనే ఉంది.. చెమ్మగిల్లిన కళ్ళ వెనుక కదలాడే కనుపాపలు ..ఇప్పుడు కదలడం మానేసినవి .. ఎంత ..విశాదమైనదీ ఈ బతుకు ? ఎంత దుర్భరమైనది ఈ నిర్వేదన ? అవును ..కాలమే కదా గాయాలను చేసేది ? ఈ కాలమే కదా గుండె కోత మిగిల్చేది ? నవ్వునే చిరునామాగా మార్చుకుని నవ్వే జీవన గమనంగా సాగిపోయి కడదాకా నవ్వుతూనే .. తరలిరాని తీరాలకేగిన ఆ రూపం ఇక కనిపించదు ఇక చూద్దామన్నా ..అగుపించదు.. (రాజేష్ ఖన్నాకు కన్నీళ్ళతో ..)

No comments: