బుద్ధి వద్దంటోంది..సుద్ది చెబుతోంది..
మది విననంటోంది..మారాం చేస్తోంది..
కంట ఒలికిన నీరు కాల్వలై పారుతోంది..
గుండె పలికిన మాట కవితలై పొంగుతోంది..
తోడులేని వాడినని తొలిసారి చెబుతోంది..
కోరకూడని ఆశ అని కోపంగా చూస్తోంది..
అయినా పట్టుదల నన్ను పరుగులెత్తిస్తోంది..
పడతి ప్రణయం కోసం ప్రాధేయ పడమంటోంది
No comments:
Post a Comment