మనసున్న ,మమతలున్న మనుషులే కరువయ్యారు
అఘాయిత్యాలు,హింస అకృత్యాల తో
దేశం అట్టుడికి పోతుంది
పచ్చదనం కరువై పోతుంది
పశుతత్వం ప్రభలిపోతుంది
వీటన్నిటికి అతీతమైన
మరో భూమి కి శుభారంభం ఎప్పుడు?
అనెకనేక కాలుష్యాల తో కళంకిత మైన
మన భరత మాత ప్రక్షాళన గావించుకొని
మరో కొంగొత్త భూ ప్రవేశానికి తరలి వచ్చే
ఘడియలు ఆసన్న మయ్యె రోజుకోసం
ఎదురు చూద్దాము ,ఆ రోజు కోసం కలలు కందాము...
No comments:
Post a Comment