Saturday, 29 December 2012

కట్టే తెంచిన యువ ఆవేశం

కట్టే తెంచిన యువ ఆవేశం, పొంగుకొచ్చిన మనో జ్ఞానం మనిషికిచెను సింధు రూపం,బయటికోచ్చేను భారత నామం, యుగాలాయెను ,సుఖములోందేను ,రాజులోచ్చిరి,రతనాలోచ్చితి, పడవలోచ్చితి,పధము మారితి ,భూమి పండగ ,రైతు నవ్వగా , దేశ సంపద కళకళలాడ ,పేరు పైపైకి ఎగసిపోగా , నాడు పడెనే సొత్తు నీడ,నాశనం మరి దరె చేరగా, రాజులేరి,రాజ్యాలేయి,ధరణి ఒంటరి అయ్యెను,భారత ఖండం భోసేను. తెలుపు నీడకు కడుపు మాడగ,ఉక్కుపాదం పుట్టగా , ఎదిరుతిరిగిన భారత బిడ్డకు ఇనపగుండు జవాబయే , ఆలోచించిన మితవాద బృందం శాంతి స్తోత్రం పాడగా, నవ్వుకొన్న తెల్లవాడు, చెరుకుపిప్పిని వదిలిపోయే.... భారతమాతకు సిగ్గుచేటు,జాతికి అది స్వతంత్ర పోటు , నిజం తెలిసిన నాటికి ,తల్లికి మిగిలే వ్యర్ధ శోకం , పుట్టెడు మంది పిల్లలున్నా ,లేదు మరి ఇంగిత జ్ఞానం, అసూయ వచెను,అవినీతి పెరిగెను, మంది పెరిగెను ,మంచి తగ్గెను, కులములోచెను,పాయచేసేను ,వర్గాలోచన మదిన మెదలగా, రాజకీయం మరల గెలిచెను, ప్రేక్షకులై ప్రజలు చూడగా, పదవులెన్నొ మారెను ,ఫలితేమేమో, దేశానికి పరకాష్టను మిగిల్చెను . కామదెయ్యపు కోరలేమో తల్లి,చెల్లెలను ఒంటరి చేయంగా , తల్లి భారత మేమి చేయును ,తల్లడిల్లిన తలవంచక, ఎత్తి ఏడ్చెను భారతమాత,వికటనవ్వుల యువత మాత్రం , నడక సాగించే చూసి చూడక. ఇది నా మాతృభూమి,భరతఖండం , నేను-నువ్వుల భుక్త కందం . -వెంకట్ వడిశెట్టి

No comments: